హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి, రోడ్ల కన్టెకివిటీకి కేసీఅర్ ప్రభుత్వం హైదరాబాద్లో పెద్ద ఎత్తున మిస్సింగ్ లింకులు, స్లిప్ రోడ్లను అభివృద్ధి చేసింది.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-5 నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2ను కలుపుతూ కొండను తొలిచి చేపడుతున్న రహదారి పనులు తుదిదశకు చేరాయి. వచ్చే నెలాఖరులోగా ఈ లింకు రహదారి ప్రజలకు అందుబాటులోకి రానున్నది. తద్వారా యూసుఫ్గూడ, కృష్ణానగర్ శ్రీనగర్కాలనీ, పరిసర ప్రాంతాలకు మహా ఉపశమనం లభించనున్నది. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరాభారం తగ్గనున్నది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్పోస్టులో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత చెక్ పడనున్నది.