కాంగ్రెస్ జమానా రైతులను ఆగం పట్టించింది. నిండా కరెంటు ఇవ్వలేని ఆ పార్టీ వ్యవసాయ యాంత్రికీకరణలోనూ అదే ధోరణి
ప్రదర్శించింది. వివిధ పథకాలతో వ్యవసాయం స్థిరీకరణకు కంకణం కట్టుకున్న కేసీఆర్ అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. వ్యవసాయ పనుల్లో రైతులకు సాయంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్నదాతలకు 19,607 ట్రాక్టర్లను బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. సమైక్య రాష్ట్రంలో బకాయిపడిన రూ.41 కోట్ల రవాణా పన్నును కూడా ప్రభుత్వం రద్దుచేసింది. వ్యవసాయ యాంత్రికీకరణ పథకం ద్వారా ఇప్పటివరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు.
ఎవుసం దండుగ అనుకున్న రోజులున్నయ్! దున్నకాల నుంచి కల్లం వరకు రైతు కట్టం అంతా ఇంతా ఉండదు. సీన్మాలల్ల, టీవీలల్ల చూయించినట్టు నిమిషాలల్ల ఒడిసే ముచ్చట కాదు. కాలంతో పరుగులు తీస్తనే అన్ని పనులెల్తయ్. మేం ఎన్ని తిప్పలు పడ్డా.. అప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ మమ్మల్ని పట్టించుకున్న రోజు లేదు. ఇంకో ఆయనైతే ఎవుసమే దండుగ అన్నడు. తెలంగాణ వచ్చినాంకనే మా రాతలు మారినయ్. రైతుబంధుతోని పెట్టుబడి తిప్పలు పోయినయ్.
నాకు 2018ల సబ్సిడీల ట్రాక్టర్ అచ్చింది. నేను 3 లక్షల 30 వేలు కడితే ప్రభుత్వం సబ్సిడీ కింద 3 లక్షల 30 వేలు ఇచ్చింది. నాకు ట్రాక్టర్ లేనప్పుడు మంది ట్రాక్టర్తోని దున్నిపిచ్చేది. ఇప్పుడు నా భూమి నేనే దున్నుకుంటున్న. సొంతంగ ట్రాక్టర్ ఉంది కాబట్టే కరెక్టు టైంకు నాట్లు అయిపోతున్నయ్. నా భూమి దున్నకం అయిపోయినాంక వేరే రైతుల భూములు కూడా దున్నుతున్న. నాకు సర్కార్ సాయం చేసింది కావట్టి, నా వంతు సాయంగా పేద రైతులకు ఫ్రీగ దున్నుతున్న. ఇయ్యాల తెలంగాణల ఎవుసం బతికి ఉన్నదంటే దానికి కారణం కేసీఆరే. ఆయన రైతుల ముఖ్యమంత్రి.
-ఎ.విష్ణువర్ధన్ రెడ్డి, రైతు, అచ్యుతాపూర్, వనపర్తి