హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ): రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు అయోధ్య రామమందిరంలో జరిగిన చోరీపై ఎందుకు మాట్లాడరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్షా నోరు విప్పడం లేదన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. రామమందిరంలో చోరీ చిన్న విషయంగా కొట్టిపారేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తీరు విచిత్రంగా ఉందన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.