పాఠశాల విద్యలో ప్రాథమిక దశ పునాది. ఈ దశలోని విద్యార్థులు వారి తరగతులకు చెందిన సామర్థ్యా లను సాధించగలిగినప్పుడే నాణ్యమైన విద్య సాకార మవుతుంది. కానీ, కరోనా తదనంతరం వారి సామర్థ్యాలు దిగువస్థాయికి పడిపోయాయి. దీనిని అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ ‘తొలిమెట్టు’ను అమలుచేయనున్నది.
పాఠశాలలు : 23,179
విద్యార్థులు : 11,24,563
శిక్షణపొందే ఉపాధ్యాయులు : 52,708
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో ప్రాథమిక దశ పునాది వంటిది. ఈ దశలోని విద్యార్థులు వారి వారి తరగతులకు చెందిన సామర్థ్యాలను సాధించగలిగినప్పుడే నాణ్యమైన విద్య సాకారమవుతుంది. కానీ, కరోనా తదనంతర పరిస్థితుల్లో చిన్నారుల్లో సామర్థ్యాలు దిగువస్థాయికి పడిపోయాయి. 75 శాతానికి పైగా చిన్నారులు చదవలేని, రాయలేని పరిస్థితిలో ఉన్నారు. దీనిని అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ ‘తొలిమెట్టు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలుచేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ‘తొలిమెట్టు’ ప్రారంభంకానున్నది. ఈ కార్యక్రమ యాక్షన్ప్లాన్ను పాఠశాల విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది 23వేల పైచిలుకు బడుల్లో 11.24 లక్షల చిన్నారులు కనీస సామర్థ్యాలను సాధించేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 52 వేల పైచిలుకు ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్లకు మూడు విడతల్లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్నది.
ఇవి వస్తే సామర్థ్యాలు సాధించినట్టే..