Chiranjeevi | వరద బాధితుల సహాయార్థం (flood victims) పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేశారు. తన తరఫున రూ.50 లక్షలు, తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు. అందుకు సంబంధించిన రెండు చెక్కులను ఇవాళ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి చిరంజీవి అందజేశారు.
అదేవిధంగా ప్రముఖ నటులు విశ్వక్సేన్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి చెక్కులు అందజేశారు. అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేశారు. అందుకు సంబంధించిన చెక్కును మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సీఎంకు అందజేశారు. గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు విరాళంగా అందజేసింది.
తెలంగాణలో వరద బాధితుల సహాయం కోసం, తన తరపున రూ.50 లక్షలు.. రాంచరణ్ తరపును రూ. 50 లక్షల రూపాయల చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేసిన చిరంజీవి
To assist the flood victims in Telangana, Chiranjeevi donated ₹50 lakh on his behalf, while Ram Charan also contributed ₹50 lakh. The… pic.twitter.com/TuFiss5cBO
— Congress for Telangana (@Congress4TS) September 16, 2024
Also Read..
Baramulla | బారాముల్లా ఎన్కౌంటర్.. పారిపోతున్న టెర్రరిస్ట్పై సైన్యం తూటాల వర్షం.. డ్రోన్ ఫుటేజ్
Mamata Banerjee | వైద్యులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన బెంగాల్ ప్రభుత్వం
Vande Metro | నేటి నుంచి వందే మెట్రో పరుగులు.. నమో భారత్గా పేరు మార్పు