హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి టీఎన్జీవోలు(TNGOs)శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం. సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ముజీబ్ హుస్సేని, పర్వతాలు, శంకర్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్కు కూడా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మారం జగదీష్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలను తమ మానిఫెస్టోలో చేర్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.