హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారిని శుక్రవారం టీఎన్జీవోస్ కేంద్ర సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి సీఎస్ వారధిగా ఉంటూ తమ పదవీ కాలంలో విజయవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆమె సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఆశిస్తూ అభినందనలు తెలియజేశారు.
సీఎస్ను కలిసిన వారిలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకాంటి ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ముజీబ్, విక్రమ్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ నగర సంఘాల నాయకులు, తదితరులు సీఎస్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ట్రెసా బృందం ఆధ్వర్యంలో..
తెలంగాణ సీఎస్గా బాధ్యతలు తీసుకున్న శాంతి కుమారిని ట్రెసా బృందం సభ్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ చరిత్రలో నిలుస్తారని పేర్కొంటూ ఆమెను అభినందించారు.