హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఉగాది పర్వదినాన సతన్నగర్ టిమ్స్ను ప్రజలకు అంకితం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో టిమ్స్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్చి రెండోవారానికి అన్ని పనులు, ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానలకు పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు టిమ్స్ ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరిందని.. 16ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు.