భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలంలో పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి పాదముద్రలను రైతులు గుర్తించారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పులి పాదముద్రలను పరిశీలిస్తున్నారు. పులి సంచారంపై నిఘా పెట్టామని, రైతులు ఆందోళనకు గురికావొద్దని అధికారులు సూచించారు.