భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ రీజన్ డిప్యూ టీ డైరెక్టర్ వెంకటేశం అన్నారు. సోమవా రం పోచంపల్లి పట్టణంలోని డై హౌజ్లో నేతన్నకు చేయూత పథకం మార్గదర్శ కాలకు అనుగుణంగా చేనేత కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీడీ వెంకటేశం మాట్లాడుతూ ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరాలనుకునే వారు ఈ నెల 31 లోగా తమ దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వర కు 5వేల చేనేత మగ్గాలకు పర్మినెంట్ జియో ట్యాగ్లు వేసి గుర్తించగా మరో 900 మగ్గాలకు తాత్కాలికంగా జియో ట్యా గ్లు వేసి గుర్తించామని తెలిపారు. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా 18వేల మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు థ్రిఫ్టు పథకంలో లబ్ధిదారులుగా చేరవచ్చని తెలిపారు.
చేనేత కార్మికులు తమ నెల వారి వేతనంలో మిగులు ఆదాయం నుంచి 8శాతం తమ ఖతాలో పొదుపుగా జమ చేస్తే ప్రభుత్వం మరో 16 శాతం జమ చేసి కార్మికులకు పథకం కాల పరిమితి ముగిసిన వెంటనే అందజేస్తుందన్నారు. గతం లో ఎంతోమంది కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధిని పొందారని, పొందని వారు ఈ సారి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సుమారు 150 దరఖాస్తులను థ్రిఫ్టు పథకం కోసం స్వీకరించారు.
ఈ పథకంలో వరుసగా మూడు నెలలు పొదుపు కట్టుకోకపోతే లబ్ధిదారుడు అనర్హుడిగా గుర్తించబడుతాడని తెలిపారు. థ్రిఫ్టు పథకంలో లబ్ధి పొందేవారు చేనేత మిత్ర పథకంలో కూడా లబ్ధిపొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కార్య క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత జౌళీ శాఖ ఏడీ విద్యాసాగర్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేశ్, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్, పద్మ శాలీ చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు మెరుగు శశికళ చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.