Palvai Harish Babu | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అప్పట్లో తల్లి, తండ్రి.. ఇప్పుడు తనయుడు.. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన రికార్డును సిర్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పాల్వాయి కుటుంబం దక్కించుకుంది. సంఖ్యాపరంగా ఒకటో నెంబర్ నియోజకవర్గమైన ఇక్కడి నుంచి గతంలో పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో పోటీచేసిన ఆయన్ను పీపుల్స్వార్ కాల్చి చంపగా, ఆయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందారు. సుదీర్ఘకాలం తర్వాత తనయుడు పాల్వాయి హరీశ్ బీజేపీ అభ్యర్థిగా సిర్పూర్ నుంచి గెలుపొందారు.
ఒకే కుటుంబం నుంచి గెలిచినవారు