JDU protests : బీహార్ సీఎం (Bihar CM) నితీశ్కుమార్ (Nitish Kumar) ను రాజ్యసభ (Rajya Sabha) కు పంపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. నితీశ్ను రాజ్యసభకు పంపవద్దని, ఆయనను తాము బీహార్ సీఎంగా మాత్రమే చూడాలని అనుకుంటున్నామని కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు నితీశ్ కుమార్ నివాసం ముందు వారు ఆందోళనకు దిగారు.
నితీశ్కుమార్ను బలవంతంగా రాజ్యసభకు పంపుతున్నారని, దీనికి వెనుక ఏదో కుట్ర ఉన్నదని జేడీయూ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నితీశ్ను రాజ్యసభకు పంపుతున్నారన్న వార్తలపై షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. అది నిజమో, పుకారో తనకు తెలియదని అన్నారు. ఆ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కాగా నితీశ్ నివాసం ముందు జేడీయూ కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Patna | JD(U) workers gather outside Bihar CM Nitish Kumar’s residence to protest over the reports of him going to the Rajya Sabha. pic.twitter.com/8ddXRURvJU
— ANI (@ANI) March 5, 2026