జయశంకర్ భూపాలపల్లి : రెండు, మూడురోజులుగా కురుస్తున్న జడివానకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు,కుంటలు అలుగు దుంకుతున్నాయి. భారీ వర్షాలకు కాటారం (మం) గంగారం గ్రామ శివారు మానేరులో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు.
బాధితులను గంగారాం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. రైతులను రక్షించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. ముఖ్యంగా వర్షం పడేటప్పుడు చెట్లకింద, కరెంట్ స్తంభాల వద్ద ఉండొద్దని హెచ్చరించారు. ప్రజలు అధైర్య పడొద్దు, ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వారు తెలిపారు.