కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మాలన్ఖేడ్లో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ (Nizam Sagar) బ్యాక్ వాటర్లో పడి ముగ్గురు మృతిచెందారు. మృతులను లింగపేట మండలంలోని ముంబాజిపేటకు చెందిన బోయినీ లింగవ్వ, ఆమె కూతురు రీనా, మేనకోడలు సౌమికగా గుర్తించారు. వీరంతా మౌలాన్ ఖేడ్ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చి నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ఆటలాడుతుండగా.. నీటిలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.