సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను కారు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వ్యక్తిని సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులను మహ్మద్ నవీద్, నిఖిల్ రెడ్డి, రాకేశ్గా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.