హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు శనివారం రాజీనామా చేశారు.
తమ రాజీనామా పత్రాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి సమర్పించారు. ఈ మేరకు వీరి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించారు. ఎమ్మెల్సీ పదవులు ఉన్న కారణంగా కడియం, పల్లా, కౌశిక్రెడ్డి శాసనసభ తొలిరోజు సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయకపోవడం గమనార్హం.