హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): పైకి చెప్పేవి నీతులు..ధర్మం పేరిట అధర్మ పనులు..మతం పేరుతో వి ద్వేషాలు.. ఇవీ బీజేపీ మార్క్ రాజకీయా లు. ఇవన్నీ చాలదన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ‘ఖర్చుల’ పేరిట ఆయన అనుచరులు రియల్టర్లు, కాంట్రాక్టర్ల నుంచి అందినకాడికి వసూలు చేస్తున్నారని సమాచారం. ఇలా వసూలు చేయడం ఎంతవరకు భావ్యమని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు.
సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు డబ్బులిస్తారా? లేదంటే ఈడీ, ఐటీ సంస్థలతో సోదాలు చేయించాలా? అని బెదిరిస్తున్నారని..రియల్టర్లు, బడాబడా కంపెనీల యజమానులకు తాఖీదులు జారీ చేస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు బాధితులు వెల్లడించారు. బెదిరింపులకు భరించలేక ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ రియల్టర్ దాదాపు రూ.2 కోట్ల మేర ముట్టజెప్పినట్టు తెలిసిందని వారు పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా రియల్టర్లు, పెద్ద పెద్ద కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.