హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో శుభపరిణామం జరిగింది. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల నికర జలాలు కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్ను బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. దీంతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లో పాలమూరు డీపీఆర్ పరిశీలనకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో-246 అమలులోకి రాకుండా నిరోధించాలంటూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తలపాత్ర ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సుదీర్ఘ విచారణ జరిగింది. రెండు రాష్ర్టాల వాదనలు ముగిసిన తరువాత తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు 2 నెలల క్రితమే ట్రిబ్యునల్ ప్రకటించింది. చివరకు జస్టిస్ బ్రిజేశ్కుమార్ బుధవారం తీర్పు వెలువరించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రొసీడింగ్స్ ప్రకారం ట్రిబ్యునల్కు పరిమిత అధికారాలు మాత్రమే ఉ న్నాయని, నికర జలాల కేటాయింపులు అంశం తమ పరిధిలో లేదని స్పష్టంచేశారు. ఏపీ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, అడ్వకేట్ ఆన్ రికార్డ్ నిఖిల్స్వామి, అడ్వకేట్ హరీశ్వైద్యనాథన్, ఇతర న్యాయవాదు లు, సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్ కోటేశ్వర్రా వు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్ విజయకుమార్, డీఈఈ ఎన్ రవిశంకర్ పాల్గొన్నారు.
ఏపీ దాఖలు చేసిన పిటిషన్ను బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ కొట్టేయడంతో పాలమూరు-రంగారెడ్డి పథకానికి సంబంధించిన డీపీఆర్ పరిశీలనకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ను అనుసరించి అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరునెలల్లోగా అనుమతులు పొందా ల్సి ఉన్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ సమర్పించింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఏపీ సర్కారు ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను సాకుగా చూపుతూ డీపీఆర్ పరిశీలన, అనుమతుల మంజూరు ప్రక్రియను సీడబ్ల్యూసీ పక్కనపెట్టింది. కోర్టు వివాదం పరిష్కారమైన తర్వాతే డీపీఆర్ను పరిశీలిస్తామని సీడబ్ల్యూసీ తెలంగాణకు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పిటిషన్ను కొట్టేయడంతో ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మిగతా డైరెక్టరీలు అనుమతులు కూడా పొందేందుకు మార్గం సుగమమైంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ దాఖలు చేసిన పిటిషన్ను బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ కొట్టేయడంపై హర్షణీయం. ఇది పాలమూరు విజయం. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, పర్యావరణ, మోటా, కేంద్ర భూగర్భజలశాఖ, విద్యుత్తు ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్ రీసెర్చ్స్టేషన్ అనుమతులు లభించాయి. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల వల్లే సాధ్యమైంది. ప్రస్తుతం న్యాయపరమైన వివాదాలు కూడా తొలగిపోవడంతో మిగతా అనుమతులన్నీ పొందేందుకు మార్గం సుగమమైంది. కేంద్రం వెంటనే డీపీఆర్ పరిశీలనను పునఃప్రారంభించి అన్ని అనుమతులను మంజూరు చేయాలి. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను వెంటనే తేల్చాలి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం అధర్మంగా వేసిన కేసును కొట్టివేసిన కృష్ణ ట్రిబ్యునల్ కొట్టివేయడంపై మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ధర్మమే గెలిచిందని అభివర్ణించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పట్టుదలగా తీసుకొని ఏపీ ప్రభుత్వవాదనలను గట్టిగ తిప్పికొట్టిందని వివరించారు. ట్రిబ్యునల్ తీర్పుతో ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనకు అడ్డంకి తొలగిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్రం వెంటనే డీపీఆర్ పరిశీలనను వేగిరం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు. – మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్