Ishita Kishore | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2022 పరీక్షల్లో టాపర్గా నిలిచిన ఇషితా కిశోర్కు హైదరాబాద్తో విడదీయరాని అనుబంధం ఉంది. బేగంపేటలో ఇషిత జన్మించారు. సివిల్స్లో టాపర్గా రావడంతో ఉత్సాహంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ టూడేతో మాట్లాడుతూ ‘బేగంపేటలో నేను జన్మించాను. హైదరాబాద్తో భావోద్వేగ పూరితమైన అనుబంధం కలిగి ఉన్నా’ అని చెప్పారు.
కుటుంబ నేపథ్యం రీత్యా బీహారీ అయినా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నారు. దేశానికి సేవ చేయడమే తన తొలి ప్రాధాన్యం అని ఇషితా కిషోర్ చెప్పారు. భారత వైమానిక దళం (ఏఐఎఫ్)లో అధికారిగా పని చేస్తున్న తన తండ్రి, ఉపాధ్యాయురాలిగా పని చేసిన స్ఫూర్తితో సమాజానికి సేవ చేయడానికి సివిల్స్ పరీక్షలు రాశానని చెబుతున్నారు.
తొలి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ కూడా దాటలేదని, అయినా మూడో ప్రయత్నంలో గట్టిగా ప్రయత్నించడంతో టాపర్గా నిలిచానని చెప్పారు. సివిల్స్లో టాపర్గా నిలిచినందుకు ఆనంద పారవశ్యంలో మునిగిపోయానని అన్నారు.
‘ఐఏఎఫ్ అధికారిగా పని చేసిన నా తండ్రి మాదిరిగానే దేశానికి సేవ చేయాలని ఎల్లవేళలా కోరుకున్నా. సుపరిపాలనలో భాగస్వామి కావాలన్న ఆలోచనతోనే ఐఏఎస్ ఎంచుకున్నా. సివిల్ సర్వీసెస్ లో పలు అవకాశాలు కల్పిస్తాయి’ అని చెప్పారు. సివిల్స్లో మెరిసిన ఇషిత ఫుట్బాల్ క్రీడాకారిణి కావడం కూడా విశేషం.