ఖమ్మం, అక్టోబ ర్ 25 (నమస్తే తె లంగాణ ప్రతినిధి): పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు షర్మిలకు మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. మూడో స్థానంలో కాంగ్రెస్ ఉం టుందని జోస్యం చెప్పారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి తుమ్మల అధికారులపై చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏడాదిలో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.