వరంగల్ : వరంగల్( Warangal )జిల్లా లో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని ఓం సాయి నగర్లో గల ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారు రూ.7.80 లక్షల నగదును అపహరించుకుపోయారు(Robbery). పొద్దున లేచి చూసేసరికి నగదు మాయమవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను త్వరలో పట్టుకుంటామన్నారు. అలాగే ఎవరైనా ఊరిళితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.