సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. లక్ష్మీ శ్రీనివాస బంగారు ఆభరణాల షాప్లో భారీగా నగదు(Gold), బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. రూ.1,50,000 నగదు, 5 తులాల బంగారం, 5 కేజీల వెండి అపహరణకు గురైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి విచారన వేగవంతం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.