మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్లో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి జైపూర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి (SBI ATM) నలుగురు దుండగులు ప్రవేశించారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేశారు. అయితే పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటుగా రావడంతో అక్కడి నుంచి ఉడాయించారు.
గుర్తించిన పోలీసులు ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లి చూడగా, గ్యాస్ కట్టర్లు, ఇనుప రాడ్లు లభించాయి. బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అందులో ఉన్న రూ.22 లక్షలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. కాగా, దుండగులను గుర్తించడానికి ఏటీఎం కేంద్రంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడంలోని ఐడీబీఐ బ్యాంక్ ఏటీఎంలో దొంగలు చోరీకి యత్నించారు. అయితే మిషిన్ లాకర్ తెరుచుకోక పోవడంతో వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.