TSPSC | హైదరాబాద్ : ఈ ఏడాది జూన్ 11న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షపై టీఎస్పీఎస్సీ వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. పరీక్ష రోజు కలెక్టర్ల ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకటన ఇచ్చామని తెలిపింది.
2,33,248 మంది పరీక్ష రాసినట్టు ప్రకటన చేశాం. పారదర్శకత కోసం అదే విషయం మీడియాకు కూడా చెప్పాం. ఓఎంఆర్ స్కానింగ్లో 2,33,506 మంది పరీక్ష రాసినట్లు తేలింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ 33 జిల్లాల్లో 994 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించాం. అనేక జిల్లాల్లో లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. లక్షల మంది పరీక్ష రాసినప్పుడు అంకెల్లో స్వల్పమార్పులు సహజమే. స్కానింగ్ తర్వాత తుది సంఖ్య ప్రకటించాం. పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదు. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.