హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం కన్నెర్ర జేస్తున్నారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఉద్యమిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. పెంచిన వంట గ్యాస్ ధర తగ్గించాలనే డిమాండ్ తో రోండో రోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఆందోళనలు చేట్టారు.
కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకుంటే బీజేపీకి బుద్ధి చెబుతామన్నారు. ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తాని నినదించారు.
మెదక్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
వనపర్తి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
నారాయణ పేట జిల్లాలో..