Theft in Jawahar Nagar | జవహర్నగర్లో ఓ పెళ్లి ఇంట భారీ దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోపిడీ దొంగలు లూటీ చేశారు. సాకేత్కాలనీ ఫేస్-1, 16బీ ఇంట్లో ఇంటి తలుపులు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు రూ.3.72లక్షల విలువైన ఆరు తులాల బంగారు గొలుసు, ఉంగరాలు, రూ.3లక్షల విలువ చేసే లాప్టాప్లు, 5కిలోల వెండి వస్తువులు, రూ.10వేలు ఎత్తుకు వెళ్లారు. బుల్లెట్ బండి సైతం ఎత్తుకువెళ్లేందుకు విఫలయత్నం చేశారు.
పెళ్లి వేడుకలకు వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఒంటిగంటకు చెల్లెలు వేడుకలకు ముగించుకొని.. అర్ధరాత్రి ఒంటిగంటకు తిరిగి వచ్చే సరికి ఇంటి వెనుకాల డోర్ పగులగొట్టి ఉన్నది. బాధిత కుటుంబం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పకడ్బందీగా దొంగలు ఇంట్లోకి ప్రవేశించడం వెనుక తెలిసిన వారి హస్తం ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వెనుక తలుపులు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.