హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసిం ది. ఈ మేరకు హైదరాబాద్ వాతావర ణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురువగా, ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో నమోదయ్యాయని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగ ర్, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది.
సాయంత్రం సమయంలో మారిన వాతావరణంతో ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సం గారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసినట్టు తెలిపింది. హైదరాబాద్లో ని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసినట్టు వెల్లడించింది. అదేవిధంగా వచ్చే ఐదు రోజులు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా, అకాల వర్షాలకు రైతులు ఆరబెట్టిన వడ్లు, మక్కలు తడిసిపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడ్డారు.