ఐనవోలు, మే 1 : జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామా న్ని స్వయం సమృద్ధి, మాలిక సదుపాయాల కల్పన విభాగంలో ఉత్తమ పం చాయతీగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 29న కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పంచాయతీ అభివృద్ధి సూచిక (అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) 2.0 నివేదిక ప్రకటించింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి (గత బీఆర్ఎస్ పాలన సమయం) స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నర్సరీ, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, మొక్కల పెంపకం, ఇంటింటికీ నల్లా, విద్యుత్తు కనెక్షన్, మహిళా సంఘాల భాగస్వామ్యం, టాక్స్ కలెక్షన్, కామన్ సర్వీస్ పాయింట్, రేషన్ కార్డ్స్ తదితర అంశాల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనను గాను ఈ అవార్డు దక్కింది.