Inter Exams | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వార్షిక పరీక్షలకు మూడు షెడ్యూళ్లను ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 5 తేదీల నుంచి పరీక్షలను ప్రారంభించేలా రూపొందించిన షెడ్యూళ్ల నివేదికను ప్రభుత్వానికి పంపింది. వీటిపై సీఎం రేవంత్రెడ్డి ఆమోదం లభించగానే పరీక్షల షెడ్యూల్ను ఖరారుచేసి విడుదల చేస్తారు. వారంరోజుల్లో పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది అంతకుముందే పరీక్షలు పూర్తికానున్నాయి. ఫ్రీ ఫైనల్ పరీక్షలను జనవరి 20 తర్వాత, సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించవచ్చు. ఫస్టియర్లో 4.5 లక్షలు, సెకండియర్లో 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 1,500 వరకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 26,333 మంది ఇన్విజిలెటర్లను పరీక్షల విధుల్లో వినియోగించనున్నారు.