హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ):రైలు ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వ, రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమని దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భద్రతా లోపాలే ప్రమాదానికి కారణం కావొచ్చని రైల్వే కన్సల్టేటివ్ మాజీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్ చౌదరి పేర్కొన్నారు. మోదీ సర్కారు నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ విమర్శించారు.
వ్యవస్థలో లోపం వల్లే ప్రమాద ఘటన జరిగిందని, రైల్వే కార్మికులను బలి పశువులను చేయ్యొద్దని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు.