మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. ధాన్యం బస్తాలతో ఆగివున్న ట్రాక్టర్ను బొలేరో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన. మంగళవారం రామాయంపేట(Ramayampeta) జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రామాయంపేట జాతీయ రహదారి పక్కన ధాన్యం బస్తాలతో ఆగివున్న ట్రాక్టర్ను బొలేరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరో డ్రైవర్ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇదే సమయంలో బొలేరో వాహనాన్ని వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.