జగిత్యాల : రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీర్పుర్ మండల కేంద్రంలో ని రోళ్లవాగు ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతుల ఆత్మహత్యలు జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందని అన్నారు.
కరెంట్, సాగు నీరు లేక రైతులు అవస్థలతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ‘ తెలంగాణ లో యూరియా, విత్తనాల పంచాయతీ లేదని అన్నారు.కల్తీ విత్తనాలు పై పీడీ యాక్ట్ తీసుకొచ్చామని వివరించారు.‘రాష్ట్రంలో 46వేల చెరువులు బాగు చేసుకున్నాం.24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్’ దేనని అన్నారు.
కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వం రూ. 22 వేల కోట్లను తీసుకొచ్చి రైతుల ధాన్యం కొనుగోలు చేసిందని అన్నారు.నిజాయితీగా పని చేస్తే ఫలితం వస్తుంది అనడానికి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణనని తెలిపారు.మంచి ప్రభుత్వాలని ప్రజలు ఎన్నుకున్నపుడూ మంచి నిర్ణయాలతో ప్రజలకు లాభం కలుగుతుందని పేర్కొన్నారు.