బయ్యారం, డిసెంబర్ 18: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడులోని ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థినులను నీటి కొరత తీవ్రంగా వేధిస్తున్నది. పాఠశాల ప్రిన్సిపాల్ రవిబాబు మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో సుమారు 240 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఐదు రోజులుగా నీరు లేక బాలికలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ఇంత మందికి సరిపడా నీటి సౌకర్యం లేకపోవడంతో మిషన్ భగీరథ నీటిని వాడుతున్నామని, భగీరథ నీరు సరిపోని సమయంలో పంచాయతీ ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి వారి అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు.