Agriculture University | వ్యవసాయ యూనివర్సిటీ / సికింద్రాబాద్ /కాశీబుగ్గ, జనవరి 11: హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూములను కేటాయించడంపై విద్యార్థిలోకం భగ్గుమన్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నది. ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 4వ రోజైన గురువారం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతోపాటు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద, వరంగల్లో విద్యార్థులు కదం తొక్కారు. జీవో 55ను రద్దుచేసేవరకు విశ్రమించబోమని స్పష్టంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం
వర్సిటీ భూముల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి, వంటావార్పు నిర్వహించారు. శాస్త్రవేత్తలు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు.. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్రెడ్డికి వ్యవసాయవర్సిటీ విలువ తెలియకపోవడం విడ్డూరమన్నారు.
విద్యార్థి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్రెడ్డి, వినయ్రెడ్డి, బాలకోటినాయక్, శంకర్ నాయక్, రాకేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వర్సిటీ ప్రధాన కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు. వ్యవసాయ అనుబంధ సంస్థల అభివృద్ధికి కేటాయించిన భూముల్లో హైకోర్టు నిర్మాణంపై ఉన్నత న్యాయస్థానంలోని మేధావులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం అధ్య క్ష, కార్యదర్శులు శ్రీనివాస్ యాదవ్, అమృత్రెడ్డి కోరారు.
అనేక జీవరాసులకు , చెట్లకు నెలవై జీవరాశి మనుగడకు దోహద పడుతున్న వర్సిటీ భూ ములను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఓయూలో ఏబీవీపీ శాఖ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనంచేసింది. జీవో నంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని ఆల్ స్టేట్ యూనివర్సిటీ కన్వీనర్ జీవన్ డిమాండ్ చేశారు. వర్సిటీకి చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తే బయోడైవర్సిటీ పారు లో ఉన్న జీవవైవిధ్యం కోల్పోతామని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇకడ 350కి పైగా పక్షులు, జంతువులు, 450కి పైగా వృక్ష జాతులు, వృక్ష ఔషధ జాతులు 80, తీగ జాతులు 30 ఉన్నాయని, హైకోర్టు నిర్మాణంతో వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. కార్యక్రమం లో ఏబీవీపీవర్సిటీ కార్యదర్శి బట్టు పరశురామ్, ఏబీవీపీ స్టేట్ వరింగ్ కమిటీ మెంబర్స్ కమల్సురేశ్, అలివేలు రాజు, స్టేట్స్ శ్రావిషార్ కన్వీనర్ తోట శ్రీనివాస్, నాయకులు వికాస్, గణేశ్, వెంకటేశ్, హరిప్రసాద్, దృహన్, కోటేశ్వర్, శివ, శంకర్, రోహిత్, రోహన్, సాద్విక్, అర్జున్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ఆరెపల్లిలోని వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వెంటనే జీవో 55ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.