హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్లో చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు చెల్లించాలని కోరుతూ సంస్థ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సర్యులర్ విడుదల చేశారు.
32 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్ 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు సమ్మె నిర్వహించారు. మే 1న కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో సమ్మెలో పాల్గొన్న వారికి ఆ మూడు రోజుల జీతం చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సమ్మె ప్రారంభం కాకముందే సెలవులో ఉన్న వారికి, వారి అర్హతను బట్టి యథావిధిగా వేతనాలు అందనున్నాయి.