హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ సమయంలో నమోదైన అన్ని కేసులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2009 డిసెంబర్ 9నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు, జ్యుడిషియల్ రిమాండ్ కేసుల వివరాలు ఇవ్వాలని పోలీసుశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ అంశంపై ఏమైనా సందేహాలు ఉంటే సీఐడీ ఇన్స్పెక్టర్లు నవీన్బాబు, శేఖర్రెడ్డిను సంప్రదించాలని సూచించింది. కాగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కో కేసుకు ఒక్కో జీవో తీసుకొచ్చి కేసులను ఎత్తివేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం 2,254 తెలంగాణ ఉద్యమ కేసులు నమోదైనట్టు పోలీసు రికార్డు లు చెప్పాయి. నాడు కేసీఆర్ చర్యలతో 2,250 కేసు లు పూర్తిగా ఎత్తివేయగా.. నాలుగు కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వీటిలో రెండు రైల్వే కేసులు ఉన్నట్టు సమాచారం