నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 27 : భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకున్నది.
వరదల కారణంగా 11 మంది మృతి..
వరదల కారణంగా ములుగు జిల్లాలో నలుగురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లిలో ఒకరు, హనుమకొండ జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఒకరు, జగిత్యాల జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో పశువులకాపరి పడి మృతి చెందాడు.