లష్కర్ బోనాల జాతర రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు సోమవారం అంబారీపై ఊరేగారు. సాయంత్రం తొట్టెల ఊరేగింపుతో వేడుక ముగిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆద్యంతం ఉత్సవాలు నేత్రపర్వంగా సాగగా, భక్తులు పరవశించిపోయారు. రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. భక్తులు చేసిన పూజలతో తాను సంతోషంగా ఉన్నానని, ప్రజలను కాపాడి చల్లగా చూసే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. గడపగడపనూ కాపాడే భారం తనపై ఉందని అన్నారు.
– హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ)