RTC Bus | జగిత్యాల, డిసెంబర్ 18: మొన్నటిదాకా ఖాళీగా కనిపించిన ఆర్టీసీ బస్సు లు.. ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్తో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సీటు కాదు కదా.. బస్సులో నిల్చుండే జాగ కూడా దొరకడం లేదు.
సోమవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి పెగడపల్లికి వెళ్తున్న బస్సుకు వెనకాల ఉన్న ఇనుపరాడ్డు, నిచ్చెనపై నిల్చొని పలువురు విద్యార్థులు ప్రయాణం చేస్తున్న దృశ్యమే అందుకు నిదర్శనం. బస్సు మొత్తం మహిళలతోనే నిండిపోవడం.. అదే చివరి బస్సు కావడంతో ఆ మండలంలోని వివిధ గ్రామాల విద్యార్థులు.. ప్రమాదమని తెలిసినా.. చేసేదేం లేక ఇలా వెళ్లారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణిలకుల రద్దీని దృష్టిలో అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు.