హనుమకొండ : హనుమకొండ(Hanumakonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మడలం నీరుకుళ్ల(Neerukulla) వద్ద హైవేపై ఆర్టీసీ బస్సు( RTC bus), ఆయిల్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
బస్సును ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ లోయలో పడిపోయింది. ములుగు నుంచి హనుమకొండకు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.