భద్రాద్రి కొత్తగూడెం : గంజాయిGanja) అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు (Julurupadu) పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు( RTC bus)లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 20 కిలోల గంజాయి పట్టుబడింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సులో తనిఖీ చేస్తుండగా రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.