జయశంకర్ భూపాలపల్లి : అడవి పందుల(Wild boars) కోసం పెట్టిన కరెంట్ తీగలకు (Electric shock)తగిలి ఓ పశువుల కాపరి మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సం ఘటన జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది రైతులు మొక్కజొన్న చేనుకు అడవి జంతువుల నుంచి రక్షణగా వేసుకున్న కరెంటు వైర్లకు తగిలి అదే గ్రామానికి చెందిన అరకొండ మల్లయ్య (45)అనే పశువుల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.