యాదగిరిగుట్ట, డిసెంబర్11 : యాదగిరిగుట్ట( Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతున్నది. కార్తీక మాసం(Kartika masam) చివరి సోమవారం కావడంతో యాదగిరిగుట్ట ఆలయ అనుబంధశివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు(Pujas) చేసి కార్తీక దీపాలను వెలిగించారు. తెల్లవారుజామున నుంచే మహిళలు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శిం చుకున్నారు. సుప్రభాత సేవ నుంచి స్వామి వారి సేవలు కొనసాగుతున్నాయి. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.