హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి కోసం(Property dispute) మానవ సంబంధాలను మరిచి తమ్ముడిపై అన్న, వదిన దాడి చేశారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని దోమకొండ మండలం అంబారీపేటలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో తమ్ముడి క్షౌరశాలకి వెళ్లి మరీ కత్తితో దాడి చేశారు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.