చందంపేట, మార్చి 3: నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సం ఖ్య భారీగా పెరిగినట్టు అటవీ అధికారు లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఏ ర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల లెక్క తేల్చినట్టు చెప్పారు. నల్లగొండ జిల్లా దేవరకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి సాయిప్రకాశ్ శుక్రవారం పేర్కొన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియాలో చిరుత పులులు 25, కృష్ణ జింకలు 320, ఎలుగుబంట్లు 56, మచ్చల జింకలు 180, హనీ బాడ్గ ర్లు 16, మనుబోతులు 43, నెమళ్లు 456, రేసు కుక్కలు 60, నిప్పు పక్షులు 12, హైనాలు 42 ఉన్నట్టు తెలిపా రు.