హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తవ్విన కొద్దీ లీకుల లింకులు బయటపడుతున్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్ లీక్లో వరంగల్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజినీర్ (డీఈ) రమేశ్ను శనివారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. కోర్డులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.
రమేశ్ వద్ద ఏఈ పరీక్ష పేపర్లు కొనుగోలు చేసిన నలుగురు అభ్యర్థులను అదుపులోకి తీసుకొని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిని ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించనున్నట్టు తెలిసింది. రమేశ్ ద్వారా 20 మందికి పైగా ఏఈ పేపర్ చేతులు మారినట్టు సిట్ గుర్తించింది. ఇందులో మరో 10 మందిని అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. ఏఈ పరీక్ష రాసిన లొకిన్ సతీశ్కుమార్ను శుక్రవారమే అరెస్టు చేశారు. ఈ ఇద్దరితో కలిపి నిందితుల సంఖ్య 46కు చేరింది. వీరిలో సిట్ 45 మందిని అరెస్టు చేసింది.