చేర్యాల, మార్చి 6 : సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. 8వ ఆదివారం సందర్భంగా 35వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కోనేటిలో పవిత్రంగా స్నానాలు అచరించారు.
స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు తదితర మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు.