ఉప్పునుంతల, సెప్టెంబర్ 10: నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు గోరటి భాస్కర్ తెలిపారు.
క్రీ.శ. 1156 ఏప్రిల్ 19న ఎంచేడలి మల్లికార్జున స్వామి నైవేద్యానికి మేర్వే నాయకుడు చేసిన దాన శాసనాన్ని గుర్తించారు. తెలుగు లిపిలో 9 పంక్తులతో ఉన్నదని, స్తంభం అంచు ఒక మూల విరిగిపోవడంతో శాసనం కొంత దెబ్బతిన్నట్టు ఆయన పేర్కొన్నారు.