హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విజన్కు ప్రతిరూపమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ పాలన ప్రాంగణానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం’గా పేరు పెట్టడం ఆయన దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కవిత ట్వీట్ చేశారు. ‘ఏప్రిల్ 30న మన రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం కాబోతున్నది. రాష్ట్ర ప్రగతి చిహ్నాన్ని ప్రారంభించుకొనే రోజు దగ్గరకు వస్తున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం సీఎం కేసీఆర్ విజన్కు ప్రతిరూపం. తెలంగాణ ప్రజల ఉనికి, ప్రగతి, అభివృద్ధి, ఎదుగుదలకు ఇదో చిహ్నం’ అని కవిత్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నూతన సచివాలయానికి సంబంధించిన వివిధ ఫొటోలను కవిత షేర్ చేశారు.