హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల కొత్త పీఆర్సీపై ప్రభుత్వం రెండో దఫా చర్చించనున్నది. ఈ నెల 10న మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో చర్చలు కొనసాగుతాయి. ఈ మేరకు విద్యుత్తు ఉద్యోగులు, జేఏసీ నేతలు సమాచారం ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో పీఆర్సీపై విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నేతలతో ఉన్నతాధికారులు మొదటి దఫా చర్చలు గంటపాటు జరిపారు.
విద్యుత్తు సంస్థల రెవెన్యూ ఆర్థిక పరిస్థితిపై జేఏసీ నేతలకు అధికారులు వివరించారు. ఉద్యోగులు కూడా పలు ప్రతిపాదనలను అధికారుల ముందుంచారు. జేఏసీ నేతల వాదనలను సావధానంగా విన్న అధికారులు ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చర్చలు ముగిసిన వెంటనే టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ సీఎండీ దేవుపల్లి ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఏ గోపాల్రావు మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి జగదీశ్రెడ్డితో సమావేశంకాగా, 10న చర్చలకు ఆహ్వానించాలని ఆదేశించారు. ఈ చర్చల్లో టీఎస్ ట్రాన్స్కో, జెన్కో జేఎండీ శ్రీనివాస్రావు, కంపెనీల హెచ్ఆర్ డైరెక్టర్లు అశోక్, పర్వత, ఎలక్ట్రిసిటీ జేఏసీ నుంచి కోడూరి ప్రకాశ్, జాన్సన్, ఎన్ శివాజీ, పీ అంజయ్య, నాజర్ షరీఫ్, మాతంగి శ్రీనివాస్, రమేశ్, ఆరోగ్యరాణి, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి సాయిబాబా, రత్నాకర్రావు, వజీర్, శ్రీధర్, అనిల్, బీసీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.